Thursday, August 1, 2019







మహేష్ బాబు హీరోగా వచ్చిన  భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగికి 20వేల జరిమానా విధిస్తారు.  ఓ చిరుద్యోగి తన నెలజీతాన్ని మొత్తం టాక్స్ గా కడితే ఎలా అని జనాలు - ప్రతిపక్షాలు గోల చేసినా సీఎం హోదాలోని మహేష్ మాత్రం అలా చేస్తేనే మన ట్రాఫిక్ వ్యవస్థ చక్కబడుతుందని సెలవిస్తాడు. ఇక సినిమా కాబట్టి అంతంత జరిమానాలు భరిస్తారని.. నిజజీవితంలో అది కష్టమని ఈ సినిమా ప్రమోషన్ కు వచ్చిన నాటి మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చాడు.
అయితే ఇప్పుడది నిజమైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి గూబ గూయ్యిమనేలా కేంద్రం కొత్త చట్టాన్ని ఆమోదించింది. కేంద్రంలో రెండోసారి అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ మొత్తం వ్యవస్థల ప్రక్షాళన దిశగా చాలా బిల్లులను పార్లమెంట్ లో ఆమోదిస్తూ ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా తెచ్చిందే ‘మోటార్ వెహికిల్ యాక్ట్’. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్న దృష్ట్యా మోడీ ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది.  పూర్వం ఉన్న చట్టానికి సవరణలు చేసిన ఈ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై పలు రాష్ట్రాలు ఆందోళనలు - అభ్యంతరం తెలిపినా కూడా కేంద్రం మాత్రం మొండిగా భారీ జరిమానాలతో ఈ బిల్లును పాస్ చేయించుకుంది.

*రాష్ట్రాలకే హక్కులు.. ఆదాయం..

ఈ బిల్లులో వాహన రిజిస్ట్రేషన్ చార్జ్ - అధికారుల పోస్టింగ్ - ఇతర ట్రాఫిక్ ఆదాయం రాష్ట్రాలకే కట్టబెట్టింది. డ్రైవింగ్ శిక్షణ సంస్థల ఏర్పాటు రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది.

*ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలుhttp://www.tupaki.com/politicalnews/article/Motor-Vehicles-Bill-2019--Complete-list-of-fines-you-will-pay-for-traffic-Violations/220123mahesh babu